
రాహుల్ను 10 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం నాడు ఏకంగా 10 గంటల పాటు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి పిలిపించారు.