Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ…కాంగ్రెస్ పార్టీలో కొత్త టెన్షన్..

ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయం హాట్ టాపిక్ అవుతోంది. శనివారం ఉదయం నుంచి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొత్త టెన్షన్ నెలకొంది. ఆదివారం కూడా వీరిద్దరి మధ్య పలు అంశాలపై చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా వీరిద్దరి మధ్య జాతీయ రాజకీయాలపై చర్చ సాగుతోందని అంటున్నారు. దేశరాజకీయాలు మార్చేస్తా అంటూ ఇప్పటికే సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ దిశగాఅందులో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంతనాలు జరుపుతున్న విషయం తెలిసిందే.

పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ తో కలిసి నడుస్తామని సీఎం కేసీఆర్‌ గతంలోనే స్పష్టం చేశారు. తాజాగా శనివారం రోజున వీరిద్దరి మధ్య భేటీ పై ఇతర పార్టీల నాయకులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఇటీవలే ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ కూడా అయ్యారు. తాజాగా హైదరాబాద్ లో కేసీఆర్ తో
ప్రశాంత్ కిషోర్ చర్చలు జరుపుతుండటంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. కాంగ్రెస్ పార్టీలో చేరి ఇటు తెలంగాణాలో టీఅర్ఎస్ పార్టీకి ఎన్నికల వ్యూహ కర్తగా ఎలా పనిచేస్తారో వేచి చూడాలి. ఇటీవల నిర్వహించిన సర్వే వివరాలు, ముందస్తుగా ప్రకటించినట్టుగా టీాఆర్ ఎస్ తో కలిసి పని చేయాలనీ పీకే భావిస్తున్నట్టు సమాచారం.

RSS
Follow by Email
Latest news