గుంటూరు-విజయవాడ రహదారికి సమీపంలో నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా వైసీపీ మూడో ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న మొదలైన సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజు సమావేశాల షెడ్యూల్ ను ప్లీనరీ కన్వీనర్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. ఈ రోజున జరిగే సమావేశాల్లో సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు, ఎల్లో మీడియా – దుష్టచతుష్టయం అంశాలపై మాట్లాడనున్నారు. పార్టీ అధినేత,సీఎం జగన్ ప్రసంగంతో ఈ ప్లీనరీ సమావేశాలు ముగుస్తాయని అయన తెలిపారు.
ఈ రోజు షెడ్యూల్ వివరాలు…