నిన్న తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడగా . .. నేడు ఆంధ్ర ప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇందుకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు తమ మొబైల్ లో results.bse.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి తమ హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేసి నేరుగా ఫలితాలను పొందొచ్చు.










