Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కాసేపట్లో 10వ తరగతి ఫలితాలు

తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మార్చి 14 నుంచి ఈ నెల 13వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.15 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లో ఫలితాలు విడుదల కానున్నాయి. ఈరోజు అనగా… ఏప్రిల్‌ 29న (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డా. యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డా.ఇ.నవీన్‌ నికోలస్‌ హాజరుకానున్నారు.

విద్యార్థులు తమ ఫలితాలను results.bse.telangana.gov.in వెబ్‌సైట్లలో హాల్‌టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి నేరుగా తెలుసుకోవచ్చు.

RSS
Follow by Email
Latest news