Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : సజ్జల

రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని అయన స్పష్టం చేశారు. మీడియా లో వస్తున్న ప్రచారాలపై అయన స్పందించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సేవలు అందించడం  లేదని సజ్జల పేర్కొన్నారు. ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రశాంత్ కిశోర్‌తో సీఎం వైఎస్ జగన్‌కి వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. 2019 ఎన్నికల్లో ఆయన మాతో కలిసి పనిచేశారు. తరువాత ప్రశాంత్ కిశోర్ మాతో పనిచేయడం లేదు. భవిష్యత్‌లో పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చు.

మాకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని అయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ మాకు పొత్తు ఉండదు. ఒంటరిగానే పోటీచేయాలన్నది సీఎం వైఎస్ జగన్ సిద్ధాంతం. మాతో పొత్తు పెట్టుకోవాలని చాలా పార్టీలు అనుకోవచ్చు. కానీ సీఎం జగన్ ఎప్పుడూ పొత్తుల్లేకుండానే రాజకీయం చేస్తున్నారు. రేపు టీడీపీ ఆందోళనలకు పిలుపునివ్వడం హాస్యాస్పదం. మహిళలకు ఎన్నడూలేని సాధికారత, భద్రత అందిస్తున్నాం. సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళా భాగస్వామ్యం అత్యధికం. టీడీపీ చేసే నిరసనలను ప్రజలు నమ్మరని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

RSS
Follow by Email
Latest news