వినాయక చవితి పండుగ వేడుకలను ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఘనంగా నిర్వహించినట్లు మీడియా సెక్రటరీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షు శ్రీ బక్కని నర్సింహులు గారు మట్టి వినాయకునికి సంప్రదాయబద్ధంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా బక్కని నర్సింహులు మాట్లాడుతూ, ‘‘ పండుగలు భారతీయ సంస్కృతికి ప్రతీకలుగా పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో దేశభక్తి పెంపునకు, జాతి సమైక్యతకు గణపతి నవరాత్రోత్సవాలు దోహదపడ్డాయన్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర పార్టీ నాయకులు శ్రీమతి గడ్డి పద్మావతి, అజ్మీర్ రాజు నాయక్, మ్యాడమ్ రామేశ్వర రావు, శ్రీనివాస నాయుడు, పెద్దోజు రవీంద్రాచారి, అశోక్, ఇందిర, శేఖర్ రెడ్డి, వెంకటరెడ్డి, జోగేందర్ సింగ్, రాఘవులు, ఎన్ వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…