Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఆధునిక యుగంలో పత్రికల స్వేచ్ఛకు ఆటంకం – TWJF రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణలో వక్తలు.

ఆధునిక యుగంలో పత్రికల స్వేచ్ఛకు జర్నలిస్టుల హక్కులకు ఆటంకం కలుగుతుందని పలువురు సీనియర్ పాత్రికేయులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ద్వితీయ మహాసభల’లోగో’ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్, తిరుమలగిరి సురేందర్, ప్రజాశక్తి మాజీ ఎడిటర్​వినయ్​కుమార్​, ఇండియా టీవీ తెలంగాణ ఇన్చార్జి సురేఖ తదితరులు పాల్గొని మహాసభల లోగోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ… సమస్యలు, అన్యాయాలు, పేద వర్గాలపై జరిగే వివక్షలపై వార్తలు రాసేందుకు విలేకర్లు వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు తలెత్తడం బబాధకరమన్నారు ఈ ప్రభుత్వాల హాయంలో జర్నలిస్టులను, యూనియన్లను అణిచివేయబడుతున్నట్లు కనిపిస్తుందని పేర్కొన్నారు. దురదృష్టవషాత్తు మీడియాలో ఎడిటర్ల ఇన్వాల్​ మెంట్​తగ్గి, యాజమాన్యాలది పెరిగిపోయిందన్నారు. దీంతో క్వాలిటీ కంటెంట్​ లు రావడం లేదన్నారు. పెరిగిన డిజిటల్​ జర్నలిజంలో మరింత బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలకు కూడా మీడియా అంటే చిన్నచూపు కలిగే పరిస్థితికి వచ్చిందన్నారు.

ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్​ తిరుమలగిరి సురేందర్​ మాట్లాడుతూ…జర్నలిస్టుల సంక్షేమం కొరకు యూనియన్లు పోరాటం చేయాలన్నారు. ప్రభుత్వ మద్ధతును కూడా గట్టుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ..ఈనెల 27వ తేదిన హైదరాబాద్​ లో ప్రతిష్టాత్మకంగా జరిగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్​ రాష్ట్ర ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అర్బన్​, రూరల్ జర్నిస్టుల సమస్యలపై మహాసభలో చర్చించి జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా తీర్మానాలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.

ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య మాట్లాడుతూ..జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం చేయాలన్నారు. జర్నలిస్టు సురేఖ మాట్లాడుతూ.. మీడియాలో మహిళల ప్రాధాన్యత పెరగాలన్నారు. కొవిడ్​ లాండి పరిస్థితులు తలెత్తినా, జర్నలిస్టులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. యూనియన్లు కూడా ఆ దిశగా అడుగులు వేయాలన్నారు.

హెచ్​యూజే అధ్యక్షుడు అరుణ్​ కుమార్​ మాట్లాడుతూ..జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావాలంటే టీడబ్ల్యూజేఎఫ్​మహ సభలను విజయవంతం చేయాలన్నారు. గ్రేటర్​ హైదరాబాద్ నుంచి దాదాపు 500 మంది జర్నలిస్టులు తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమం లో ఐ ఎఫ్ డబ్ల్యూ జే కార్యదర్శి పి ఆనందం, టీ డబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు ప్రభాకర్, రాంచందర్, హెచ్ యూ జే అధ్యక్షులు బి. అరుణ్ కుమార్, కార్యదర్శి బొల్లె జగదీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, కోశాధికారి బి రాజశేఖర్, నాయకులు కాలేబ్, మధుకర్, రామకృష్ణ, బాలు, క్రాంతి, మాధవరెడ్డి, కిరణ్ కుమార్, శశికళ,విజయ తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news