Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మునుగోడు లో ఈనెల 19న టీఆర్ఎస్ బహిరంగ సభ..?

కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇస్తానని ఎలాగైనా  చేజిక్కించుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా  ఈనెల 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి అమిత్ షా హాజరుకానున్నారు. అయితే.. బీజేపీ సభ కంటే ముందే సభ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. దాదాపుగా ఈనెల 19న మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది.

మరో మూడు నెలల్లో ఉప ఎన్నిక జరగనున్నాయి.  బిజెపి నుండి రాజగోపాల్ బరిలోకి దిగుతుండడం తో విజయం ఫై బిజెపి ధీమా వ్యక్తం చేస్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ సైతం గెలుపు ఫై ధీమాగా ఉన్నారు. ఈ తరుణలో టిఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులేస్తోంది. గురువారం సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు.

మునుగోడు  ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున ఎవరిని బరిలో దింపితే గెలుస్తారు..? ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి..? అనే వివరాలపైనా ఆరా తీశారు. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి కష్టపడి పని చేయాలని, తప్పనిసరిగా మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేయాలని నాయకులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు  సమాచారం.

RSS
Follow by Email
Latest news