నరసరావుపేట జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ సూపరిండెంట్ పి చంద్ర రావు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ లకు సంబంచిన డిపార్ట్మెంట్ మీటింగ్ ఉందని నరసరావుపేట DTWO కు రావాలని తనను పిలిపించిన ఆయన కులం పేరుతో తనను దూషించారని వార్డెన్ గిరి రాజు శ్రీనివాసరావు ఆరోపించారు. బ్రాహ్మణ కులం పేరుతో దూషిస్తూ భౌతిక దాడి చేయడం జరిగిందని అయన ఆరోపించారు. తోటి ఉద్యోగస్తులు చూస్తుండగానే తనపై దౌర్జన్యం చేశారని శ్రీనివాస రావు అన్నారు. సూపరిండెంట్ పి చంద్ర రావు పై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్రీనివాసరావు నరసరావుపేట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసు విచారణ నిర్వహిస్తున్నారు.