Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పొలిటికల్ మేనేజర్ రామిశెట్టి చిన్నబాబు తెలిపారు. ప్రత్తిపాడు మండలంలోని జగనన్న పాలన మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్బంగా మండల వ్యాప్తంగా భారీగా కేకులు కట్ చేసి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ అన్న పాలన అందిస్తున్నారని అయన తెలిపారు. పత్తిపాడు గ్రామ సర్పంచ్ గుడాల విజయలక్ష్మి వెంకటరత్నం, ఎంపీపీ గోళ్ళ క్రాంతి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే  ఒమ్మంగి గ్రామంలో జరిగిన వేడుకల్లో సొసైటీ అధ్యక్షులు కొప్పన గంగారావు, మామిడి నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో ఎంపీటీసీ దాడిశెట్టి రాణి చక్రధర్, పోతులూ రు లో పంచాది వీరబాబు, వాకపల్లి లో సర్పంచ్ రోంగాల నాగేశ్వరరావు, తదితర గ్రామాల్లో మూడు సంవత్సర వేడుకలు నిర్వహించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అంతా సమిష్టిగా పని చేస్తూ ఉన్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest news