మునుగోడు శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సరిగ్గా 6 గంటలు కాగానే… మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. దింతో మంగళవారం సాయంత్రం దాకా మునుగోడు వ్యాప్తంగా ప్రచారం హోరెత్తగా… కాసేపటి క్రితం అన్ని పార్టీల గళాలు మూగబోయాయి.
ఇక ఈ నెల 3న (గురువారం) ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కానుంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ కు సంబందించి ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఉప ఎన్నికల బరిలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి మొత్తం 47 మంది బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వీరి భవితవ్యాన్ని మునుగోడు ఓటర్లు గురువారం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. వీరి భవితవ్యం ఈ నెల 6న తెలియనుంది.