Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

వర్షంతో నిలిచిపోయిన టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్

టీమిండియా, ఇంగ్లండ్ మధ్య బర్మింగ్ హామ్ లో జరుగుతున్న ఐదో టెస్టు (రీషెడ్యూల్డ్) మ్యాచ్ వర్షం కురవడంతో  ఆట నిలిచిపోయింది. తొలి రోజు ఆట ఆరంభమైన కాసేపటికే వర్షం జోరుగా కురవడంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. అప్పటికే టీమిండియా 2 వికెట్లు కోల్పోయి  53 పరుగులు చేసింది. భారత్ స్కోరు 27 పరుగుల వద్ద ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (17) పరుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ ఛటేశ్వర్ పుజారా (13) పరుగుల వద్ద వెనుదిరిగాడు.  హనుమ విహారి 14, విరాట్ కోహ్లీ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో వర్షం ఏకధాటిగా కురవడం, ఇంతకు తగ్గకపోవడంతో అంపైర్లు ముందుగానే లంచ్ విరామం ప్రకటించారు. ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఈ రెండు వికెట్లు తీశాడు.

RSS
Follow by Email
Latest news