Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నావికాదళ స్థావరంలో తలదాచుకున్న ప్రధాని మహింద రాజపక్స కుటుంబం

శ్రీలంకలో అధికార పార్టీపై నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయన తన పదవికి రాజీనామా చేసిన అనంతరం రాత్రికిరాత్రే ఆయన అధికారిక నివాసం వద్దకు ఆందోళనకారులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతాబలగాలు పలుమార్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అలాగే పలు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

దేశంలో నిరసనలు హింసాత్మక రూపుదాల్చిన నేపథ్యంలో భద్రతా కారణాలరీత్యా మాజీ ప్రధాని మహింద రాజపక్స కుటుంబాన్ని అక్కడినుంచి తరలించారు. కొలంబోకు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ నావికాదళ స్థావరంలో ఆ కుటుంబం తలదాచుకుంది. ఓ హెలికాప్టర్ లో ట్రింకోమలీలోని ఓ నేవీ బేస్ కు ఆయన కుటుంబ సభ్యులను తరలించారు. కాగా, రాజపక్స కుటుంబం ఆశ్రయం పొందుతున్న నేవీ స్థావరం ఎదుట కూడా నిరసనలు భగ్గుమంటున్నట్టు సమాచారం.

నిన్న కొలంబో వెలుపల ఆందోళనకారుల ఆగ్రహావేశాలకు గురైన అధికార పార్టీ ఎంపీ భయంతో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. శ్రీలంకకు స్వాతంత్య్రం వచ్చిన 1948 నుండి ఇంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడం ఇదే ప్రథమం. శ్రీలంకలో ప్రభుత్వం పతనావస్థకు చేరుకుంది.

RSS
Follow by Email
Latest news