Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రాజ్ భవన్ ముందు ఉద్రిక్తత… మేయర్ గద్వాల విజయలక్ష్మి అరెస్ట్

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  బండి సంజయ్ పై ఫిర్యాదు చేసేందుకు జీహెచ్ఎంసీ మేయర్, ప్రభుత్వ విప్  ఎమ్మెల్యే గొంగిడి సునీత  ఆధ్వర్యంలో మహిళా కార్పొరేటర్లు, పలువురు మహిళా నేతలు రాజ్ భవన్ కు వచ్చారు. ఉదయం నుంచి గవర్నర్ అపాయింట్ మెంట్ అడిగినా  ఇవ్వడం లేదని కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.

యితే గవర్నర్ తమిళి సై అపాయింట్ మెంట్ ఖరారు కాలేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపినా అక్కడి నుంచి వెళ్లకుండా రాజ్ భవన్ ముందు నగర మేయర్, మహిళా కార్పొరేటర్లు బైఠాయించి ఆందోళనకు దిగారు. వినతి పత్రాలను  రాజ్ భవన్ గోడకు అంటించారు. బీజేపీకి,  గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే గొంగిడి సునీత డిమాండ్ చేశారు. దింతో మేయర్ తో పాటు మహిళా కార్పొరేటర్ లను, నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

RSS
Follow by Email
Latest news