నవంబర్ 27 న హైదరాబాద్ లోని ఆర్టీసీ కళాభవన్ లో జరిగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ (టీ డబ్ల్యూ జే ఎఫ్ ) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని హెచ్ యూ జే అధ్యక్షులు బి అరుణ్ కుమార్, కార్యదర్శి బి జగదీశ్వర్ తెలిపారు. శనివారం హెచ్ యూ జే సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జర్నలిస్టులు ఎదురొంటున్న పలు సమస్యలపై చర్చించారు.
ఈనెల 27న టీ డబ్ల్యూ జే ఎఫ్ మహాసభల తరువాత జర్నలిస్ట్ లకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డుల ఇష్యుపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్టు అరుణ్, జగదీశ్వర్ తెలిపారు. ఈ సమావేశంలో హెచ్ యూజే జాయింట్ సెక్రటరీలుగా వంగాల రమేష్, క్రాంతి, ఈసి సభ్యులుగా విజయ, శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ గా గండ్ర నవీన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా చారి, జాతీయ కౌన్సిల్ సభ్యులుగా చిట్యాల మధుకర్ ఎన్నికయ్యారని పేర్కొన్నారు.