Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఈనెల 27న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ (టీ డబ్ల్యూ జే ఎఫ్ ) రాష్ట్ర మహాసభలు

నవంబర్ 27 న హైదరాబాద్ లోని ఆర్టీసీ కళాభవన్ లో జరిగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ (టీ డబ్ల్యూ జే ఎఫ్ ) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని హెచ్ యూ జే అధ్యక్షులు బి అరుణ్ కుమార్, కార్యదర్శి బి జగదీశ్వర్ తెలిపారు. శనివారం హెచ్ యూ జే సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జర్నలిస్టులు ఎదురొంటున్న పలు సమస్యలపై చర్చించారు.

ఈనెల 27న టీ డబ్ల్యూ జే ఎఫ్ మహాసభల తరువాత జర్నలిస్ట్ లకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డుల ఇష్యుపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్టు అరుణ్, జగదీశ్వర్ తెలిపారు. ఈ సమావేశంలో హెచ్ యూజే జాయింట్ సెక్రటరీలుగా వంగాల రమేష్, క్రాంతి, ఈసి సభ్యులుగా విజయ, శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ గా గండ్ర నవీన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా చారి, జాతీయ కౌన్సిల్ సభ్యులుగా చిట్యాల మధుకర్ ఎన్నికయ్యారని పేర్కొన్నారు.

RSS
Follow by Email
Latest news