షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) కేటగిరీ కింద గిరిజనులకు కేటాయించిన రిజర్వేషన్ల శాతాన్ని తెలంగాణ సర్కారు పెంచింది. ప్రస్తుతం తెలంగాణలో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమలు అవుతుండగా… తాజాగా దానిని 10 శాతానికి పెంచుతూ… రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది.
అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరించింది. అంతేకాకుండా ఉద్యోగాల భర్తీకి సంబంధించి రోస్టర్ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో భర్తీ అయ్యే ప్రతి పదో ఉద్యోగం గిరిజనులకు దక్కనుంది.