Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

దుర్గమ్మ దయతోనే తాను పడవ ప్రమాదం నుంచి బయటడ్డా… దేవినేని ఉమ

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇటీవల పడవ ప్రమాదం నుంచి బయట పడ్డ సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లాల్లోని వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తూ సోంపల్లి రేవు వద్ద జరిగిన పడవ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.  ఈ నేపథ్యంలో అయన విజయవాడలోని కనకదుర్గమ్మను నిన్న దర్శించుకున్నారు.

విజయవాడ దుర్గగుడి,  మైలవరం, నూజివీడు విఘ్నేశ్వరస్వామి ఆలయం, బాప్టిస్టు చర్చిలో, అలాగే గొల్లపూడి దర్గాలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  దుర్గమ్మ దయతోనే తాను పడవ ప్రమాదం నుంచి బయటడ్డానని అన్నారు. తనకు లభించిన ఈ పునర్జన్మను ప్రజాసేవకే అంకితం చేస్తానని దేవినేని ఉమ స్పష్టం చేశారు.

RSS
Follow by Email
Latest news