తమిళనాడు రాజకీయాల్లో సోమవారం నాడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి, శశికళకు తమిళనాడు సెషన్స్ కోర్టు షాకిచ్చింది. అన్నాడీఎంకేతో శశికళకు ఏమాత్రం సంబంధం లేదంటూ కోర్టు తీర్పు చెప్పింది. అన్నాడీఎంకే పార్టీ నుండి తనను సస్పెండ్ చేసిన తీర్మానాన్ని సవాల్ చేస్తూ…శశికళ కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అన్నాడీఎంకే తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని కూడా సెషన్స్ కోర్టు తేల్చి చెప్పింది. అయితే సెషన్స్ కోర్టు కేవలం అన్నాడీఎంకే పార్టీ దాఖలు చేసిన పిటిషన్పైనే స్పందించిందని శశికళ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.
