Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణాలో పెరుగుతున్న కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 15,200 కరోనా పరీక్షలు నిర్వహించగా, 145 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సెంచరీ దాటింది. 117 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 75 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,94,329 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,89,241 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 977 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మరణించారు.

RSS
Follow by Email
Latest news