హైదరాబాద్లో ఓ ల్యాండ్ మార్క్గా నిలిచిన గాంధీ భవన్కు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తొలిసారి వచ్చారు. సోనియా గాంధీ కానీ ఆమె తనయుడు రాహుల్ గాంధీ కూడా ఇప్పటివరకు రానే లేదు. అయితే తాజాగా రెండు రోజుల తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల గాంధీ తొలిసారి గాంధీ భవన్ ను సందర్శించారు.
చారిత్రక కట్టడంగా ఉన్న గాంధీ భవన్కు తమ నేత రాహుల్ తొలి సారి రావడం సంతోషాన్నిచ్చిందని సదరు ట్వీట్లో రేవంత్ పేర్కొన్నారు. ఆ ట్వీట్కు ‘మైలీడర్ రాహుల్ గాంధీ’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ను కూడా ఆయన జత చేశారు.