Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఢిల్లీలో కవిత దీక్షకు ఇచ్చిన అనుమతి రద్దు…

భారత్ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన దీక్షకు పోలీసులు ముందుగా ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తీసుకురావాలనే డిమాండ్ తో ఈ నెల 10న నిరసనలు చేపట్టాలని కవిత ప్రకటించారు. అయితే వివిధ  కారణాలతో పర్మిషన్ ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా కొంచెం స్థలాన్ని మాత్రమే వాడుకోవాలని, లేదంటే వేదికను మరో చోటకు మార్చుకోవాలని సూచించారు. గురువారం ఢిల్లీలో మీడియాతో కవిత మాట్లాడుతుండగానే.. పోలీసులు ఈ మేరకు సమాచారం ఇవ్వడం గమనార్హం.

5 వేల మందితో సభ నిర్వహించేందుకు 10 రోజుల క్రితమే అనుమతి ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు ఇలా రద్దు చేయడం ఏమిటని కవిత ప్రశ్నించారు. అయితే బిజెపి వాళ్లు కూడా ధర్నాకు పర్మిషన్ కోరారని, దీంతో జంతర్ మంతర్ వద్ద గల సగం స్థలాన్ని మాత్రమే వాడుకోవాలంటూ పోలీసులు సూచించినట్లు ఆమె వివరించారు. అయినా  ఇప్పటికిప్పుడు బిజెపి వాళ్లు సభ పెట్టుకోవటం ఏంటని కవిత ప్రశ్నించారు. ఇదంతా కావాలనే చేస్తున్నట్లు తెలుస్తోందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. అయితే తమ దీక్షలో మాత్రం మార్పులేదని, యథావిధిగా నిరసన కొనసాగిస్తామని కవిత స్పష్టంచేశారు. ఈ విషయంపై పోలీసులతో సంప్రదింపులు జరుపుతామని ఆమె తెలిపారు.

RSS
Follow by Email
Latest news