Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

 ప్రజలు తమపై విశ్వాసం పెట్టారు : డీకే శివకుమార్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ విలేకరులతో శనివారం నాడు మాట్లాడారు. ఈ సందర్భంగా అయన భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడంతో 50రోజుల పాటు తీహార్ జైలులో ఉన్నానని, ఆ సమయంలో తనను కలవడానికి వచ్చిన సోనయా గాంధీని చూసి కన్నీటి పర్యంతమైనట్లు శివకుమార్ గుర్తు చేసుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తానని ఆనాడు సోనియా గాంధీకి హామీ ఇచ్చినట్లు గుర్తు చేసారు. కాంగ్రెస్ కార్యాలయమే తమ దేవాలయమని, అందులోనే తమ భవిష్యత్ కార్యచరణను నిర్ణయిస్తామని శివకుమార్ అన్నారు. 

ఇది పార్టీ కార్యకర్తల విజయం : శివకుమార్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి కార్యకర్తలు, నాయకుల కృషి ఎంతో ఉందని, అందరూ కష్టపడి పని చేశారని శివకుమార్ తెలిపారు. నేపథ్యంలో వారందరికీ అయన ధన్యవాదాలు తెలిపారు.   ప్రజలు తమపై విశ్వాసం ఉంచారని పేర్కొన్నారు. కర్ణాటకకు అండగా ఉంటానని గాంధీ కుటుంబానికి, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆనాడే తెలిపానని శివకుమార్ అన్నారు. 

RSS
Follow by Email
Latest news