Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఆక్రమించుకున్న దళితుల భూములను తిరిగి ఇచ్చేయాలి : మల్లేశం

అగ్రకుల భూస్వామి ఇటీవల ఆక్రమించుకున్న దళితుల భూములను తిరిగి ఇచ్చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గం, కొందుర్గు మండలం, రేగడి చిలకమర్రి గ్రామంలో ఒక అగ్రకులస్థుడైన బడా భూస్వామి దళితుల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅథితిగా మల్లేశం పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… దళితుల భూములను ఆక్రమించుకున్న అగ్రకులస్థుడు బేషరతుగా ఆ భూములను వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ  పోరాటారించారు.

ఈ కార్యక్రమంలో భూ పోరాట ఉద్యమ రథసారథి ప్రముఖ న్యాయవాది తుప్పుడు నర్సయ్య, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం నాయకురాలు తుప్పుడు అంజమ్మ, బహుజన నాయకులు కడ్మూరు ఆనందం, టిపిసిసి అధికార ప్రతినిధి పామెన భీమ్ భరత్, ప్రజా చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లేశం, బేడ బుడగ జంగం హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరి మన్యం, రైతు సంఘం రాష్ట్ర నాయకులు నాగిరెడ్డి, తెలంగాణ ప్రజాఫ్రంట్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అర్జున్పప్ప, ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహేష్, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news