Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

వి ఎస్ యూనివర్సిటీలో ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, స్వతంత్ర భారతదేశ ప్రథమ హోం శాఖ మాత్యులు, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున జరిపే విషయం తెలిసిందే. ఈరోజున  ఈ దినోత్సవాన్ని, రాష్ట్రీయ ఏక్తా దివస్ ని జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ డా. పి రామచంద్రా రెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ… సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరోచిత సంకల్పం గొప్పదని కొనియాడారు. అయన చేసిన కృషి తోనే ఈ రోజు భారత దేశం కలిసి ఉందని అన్నారు. స్వాతంత్య్రం రాక ముందు మన దేశంలో ఎన్నో చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన వున్నాయని, వాటినన్నిటిని కలిపేసి ఒక పెద్ద దేశంగా ఏర్పడటానికి అయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. మనందరం కూడా కలిసికట్టుగా మన దేశ అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. మొదట మనం భారతీయులమని తర్వాతే ప్రాంతీయులమని అన్నారు. కులమైన, వర్ణమైన, మతమైనా మరి ఏదైనా మనం విడిపోకుండా అందరు కలిసి మెలిసి ఐక్యతతో దేశ పరిరక్షణకు, దేశ సమైక్యతకు పాటుపడాలని కోరారు.

అనంతరం ఎన్ ఎస్ ఎస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, విశ్వవిద్యాలయం అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల చేత ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య జి విజయ ఆనంద కుమార్ బాబు, ఆచార్య సుజా ఎస్ నాయర్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. కె. ప్రభాకర్, డా. సుజయ్, డా. హనుమ రెడ్డి, ఎన్ వై కె డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, డా. ఏ మహేంద్ర రెడ్డి, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news