Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

వరుసగా 8వ పరాజయంపాలైన ముంబై ఇండియన్స్ జట్టు

ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 8వ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా 8 పరాజయాలను మూటగట్టుకోలేదు. ముంబై ఇండియన్స్ జట్టు ఇంత చెత్త రికార్డు సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

మొదటగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 132 పరుగులే చేసి చేతులెత్తేసింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లపై భారీ ఆశలు పెట్టుకున్న ముంబై జట్టుకు ఒకరకంగా షాక్ అనే చెప్పాలి. తాజా విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.

RSS
Follow by Email
Latest news