Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 3 నుంచి జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల జులై 31న మధ్యాహ్నం 2 గంటలకు నూతన సచివాలయం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనున్నది.  ఈ వర్షాల వల్ల వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ చర్చించనున్నది. అలాగే ఇతర పలు అంశాల పై రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నది.

రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాలతో రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ చర్చించనున్నది. అలాగే, ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినెట్ తగు నిర్ణయం తీసుకోనున్నది.

RSS
Follow by Email
Latest news