Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మంత్రి రోజా సెల్ ఫోన్ దొరికింది..

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా తన జిల్లా పర్యటనకు వెళ్లిన రోజాకు షాక్ తగిలింది. తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పద్మావతి గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. అక్కడ ఆమెను సన్మానించేందుకు అధికారులు, పార్టీ నాయకులు పోటీపడ్డారు. ఈ క్రమంలో ఆమె సెల్ ఫోన్ దొంగతనంకు గురైంది. గమనించిన మంత్రి రోజా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడున్న సీసీ టీవీల ఫుటేజీని పరిశిలించి దొంగను గుర్తించారు.

రోజా సెల్ ఫోన్ తస్కరించి సదరు వ్యక్తి ఓ కారులో వెళుతున్న సీసీ ఫుటేజీ ఆధారంగా ఆ కారు నంబర్ గుర్తించి సిటీలోని అన్ని పోలీస్ స్టేషన్స్ కి సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఆ కారుని గుర్తించి దొంగను పట్టుకుని మంత్రి సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకుని మంత్రికి అప్పగించారు. తన సెల్ ఫోన్ దొరకడంతో మంత్రి రోజా ఊపిరి పీల్చుకున్నారు.

RSS
Follow by Email
Latest news