మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా తన జిల్లా పర్యటనకు వెళ్లిన రోజాకు షాక్ తగిలింది. తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పద్మావతి గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. అక్కడ ఆమెను సన్మానించేందుకు అధికారులు, పార్టీ నాయకులు పోటీపడ్డారు. ఈ క్రమంలో ఆమె సెల్ ఫోన్ దొంగతనంకు గురైంది. గమనించిన మంత్రి రోజా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడున్న సీసీ టీవీల ఫుటేజీని పరిశిలించి దొంగను గుర్తించారు.
రోజా సెల్ ఫోన్ తస్కరించి సదరు వ్యక్తి ఓ కారులో వెళుతున్న సీసీ ఫుటేజీ ఆధారంగా ఆ కారు నంబర్ గుర్తించి సిటీలోని అన్ని పోలీస్ స్టేషన్స్ కి సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఆ కారుని గుర్తించి దొంగను పట్టుకుని మంత్రి సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకుని మంత్రికి అప్పగించారు. తన సెల్ ఫోన్ దొరకడంతో మంత్రి రోజా ఊపిరి పీల్చుకున్నారు.