Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మునుగోడు ఉప ఎన్నిక పై మంత్రి కేటీఆర్ కామెంట్..

మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి , కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం తో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఉప ఎన్నికల ఫై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ , మంత్రి కేటీఆర్ స్పందించారు. మునుగోడు ఒక అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నిక మాత్రమే.. ఆ ఎన్నికతో మారేదేం ఉండదు అని అయన అన్నారు.

తెలంగాణను కేసీఆర్‌ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అందులో భాగంగా మునుగోడు ఉప ఎన్నిక ఫై ప్రశ్నించగా ఈ సమాధానం ఇచ్చారు.

RSS
Follow by Email
Latest news