Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కర్ణాటకలో ఎన్నికల బరిలో ఎంఐఎం

కర్ణాటక అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో తన అభ్యర్థులను పోటీలో నిలపాలని ఎంఐఎం ఛీఫ్ సదుద్దీన్ ఒవైసీ భావిస్తున్నారు. ఈ మేరకు మూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు పేర్లతో తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తమ సామజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపాలని యోచిస్తున్నారు. కర్ణాటకలో కనీసం 20 స్థానాల్లో పోటీ చేయాలని ఒవైసీ భావిస్తున్నారు. ఎంఐఎం టికెట్ల కోసం పోటీ కూడా ఎక్కువగానే ఉంది. టికెట్ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు కూడా జరుగుతున్నాయని సమాచారం. మరోవైపు అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ, మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వేచిచూడాలి.

RSS
Follow by Email
Latest news