Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు…

రాజపేట మండల పరిధిలోని పాముకుంట గ్రామంలోని మధిర కషాయిగుడెం నుండి సుమారు 100 మంది బుధవారం రోజున కాంగ్రె స్ పార్టీలో చేరడం జరిగింది. టి పి సి సి సభ్యులు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బీర్ల ఐలయ్య సమక్షంలో వారు పార్టీలో చేరడం జరిగింది. వారికీ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం ఐలయ్య మాట్లాడుతూ కషాయ గూడెం నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరములు అయిన రాజపేటలో గాని నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని అయన ఆరోపించారు. ఆలేరు ఎమ్మెల్యేపై ప్రజల వ్యతిరేకత ఉండడంతో… ఆలేరులో ఓడిపోతున్నాం అని సంకేతాలు రావడంతో… అనేక రకాల ప్రలోభాలకు గురిచేస్తూ… కాంగ్రెస్ పార్టీ నాయకులను కొనుగోలు చేద్దామని అనుకుంటున్నారని తెలిపారు. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని వారన్నారు.

పార్టీలో చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ ఆలేరులో బిర్ల ఐలన్న చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరామని ఆలేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బీర్ల ఐలయ్యను గెలిపించుకుంటామని వారన్నారు ఈ కార్యక్రమంలో ఎస్.కె అబ్దుల్, చాంద్ పాషా, మదర్ జాంగిర్,ఇసాక్, నూర్ పాషా, ఎండి మదర్, కరీం అలీ, ఎస్ కె కరీం, అస్లాం బాబా, చిన్న జాంగిర్, కాసిమ్, జమాల్, అసాన్ హుస్సేన్, రజనీకాంత్, గుంశావలి, ఎండి బడే మియా, మధిర కరీం, బడే సాబ్, బాబు, పాషా, రహీం, ఇమామ్, రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు పాండు యువ నాయకుడు ఇంజ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news