Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మన బస్తీ-మన బడి

మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపెట్టారన్నారు. అందులో భాగంగా  సుబేదారి ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి కార్పోరేటుకు దీటుగా  తీర్చిదిద్దేందుకే సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.

మన బస్తీ-మన బడి కార్యక్రం వివరాలు…

?ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం బోధన చేపట్టాలని, అందుకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు విద్య శాఖ అధికారులు తీసుకుంటున్నట్లు దాస్యం తెలిపారు.
?గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోంది.
?తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేందుకు ముందుకు కోస్తున్నారు.
?మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో పాఠశాలల్లో నీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్‌, ఫర్నిచర్‌, పెయింటింగ్‌, గ్రీన్‌చార్ట్‌ బోర్డులు, కాంఫౌండ్‌ వాల్స్‌, డైనింగ్‌ హాల్‌, డిజిటల్‌ క్లాసులు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు.
? వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్య బోధన అమలవుతుంది.
?రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,289 కోట్లతో కార్యక్రమం చేపట్టింది.
? తొలి విడుతగా 9,123పాఠశాల్లో 12 రకాల సదుపాయాలు కల్పించేందుకు రూ.3,497 కోట్ల ఖర్చు చేస్తున్నారు.
?2,500 పాఠశాలలో భోజనశాలలు ఏర్పాటు చేస్తున్నారు.
? వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 32 పాఠశాలలో మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని దాస్యం తెలిపారు.

RSS
Follow by Email
Latest news