Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ప్రారంభమైన మహానాడు

తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా జరుగుతున్న ఈ మహానాడు ఒక  ప్రత్యేకమని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి దశ దిశ నిర్థేశించే స్థలంగా ఈ మహానాడు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలను తెలుగు దేశం అవిర్భావం ముందు తెలుగు దేశం ఆవిర్భావం తరువాత అని లెక్కించుకోవాలన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. రాక్షస పాలన వచ్చింది అని అన్నారు,. ప్రశ్నిస్త దాడులు చేసే సంస్కృతి ని వైసిపి తీసుకువచ్చిందని, నేతల అరెస్టులు, కార్యకర్తలపై దాడులు జరిగితే నిద్రలేని రాత్రులు గడిపామని, వైసిపి ప్రభుత్వానికి అభివృద్ది చేతకాదని, వాళ్లు చెపుతున్న సంక్షేమం ఒక బూటకమని అన్నారు, నాడు రౌడీలను అణిచివేసిన పోలీసులు ఇప్పుడు ఉన్మాది పాలనలో గాడి తప్పార విమర్శించారు. జగన్ నమ్ముకున్న అధికారులు నాడు జైలుకు వెళ్లారు. ఇప్పుడు మళ్లీ తప్పుడు పనులు చేసిన వారు తిరిగి జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.

RSS
Follow by Email
Latest news