Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తవేత…దిగువనకు 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల..

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. శ్రీరాంసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1,088.70 అడుగుల నీరు ఉన్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,08,000 క్యూసెక్కుల నీరు చేరుతుంది. దీంతో అధికా రులు 32 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు.  అలాగే, విద్యుత్‌ ఉత్పత్తికోసం ఎస్కేప్‌ గేట్‌ ద్వారా 8 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కాగా,  ప్రాజెక్టులో 90 టీఎంసీల నీటిని నిల్వచేయవచ్చు. అయితే ఇప్పుడు 78.661 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

 

RSS
Follow by Email
Latest news