Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

‘తిరగబడదాం-తరిమికొడదాం’

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) విస్తృతస్థాయి సమావేశం గాంధీభవన్ లో జరిగింది. ఈ నెల 21 నుంచి 25 వరకు రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తాం. ‘తిరగబడదాం-తరిమికొడదాం’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన సమావేశానికి ఏఐసీసీ ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ, ఇతర ముఖ్య నేతలు భేటీకి హాజరయ్యారు.

సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల ప్రజాగర్జన సభ నిర్వహిస్తాం, ఈ ప్రజాగర్జన సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలిపారు. ఈ సభలోనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను విడుదల చేయనున్నట్లు అయన అన్నారు. అలగే ఈ నెల 29న వరంగల్ లో మైనార్టీ డిక్లరేషన్ విడుదల చేస్తామని వివరించారు. ఓబీసీ, మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తాం. మహిళా డిక్లరేషన్ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానించనున్నట్లు రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రకటిస్తామఅయన అన్నారు.

RSS
Follow by Email
Latest news