ఆర్మీ చీఫ్ గా (చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్) లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఎంఎం నరవణే ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు పదవిలో కొనసాగిన ఎంఎం నరవణే పదవీకాలం ముగియడంతో ఆయనపాండే కు పదోన్నతి దక్కింది. ఇంతకు ముందు వరకు జనరల్ మనోజ్ పాండే ఆర్మీ వైస్ చీఫ్ గా పనిచేశారు. ప్రస్తుతం అయన స్థానంలో ఆర్మీ వైస్ చీఫ్ పదవిని మే 1న బీఎస్ రాజు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ గా రాజు విధులు నిర్వర్తిస్తున్నాడు.