Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మం..

కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో సిఎం కెసిఆర్ ప్రారంభించిన విషయం విదిత‌మే. అయితే.. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు ఖర్చు చేసింది కూడా. అయితే.. పథకంలో భాగంగా కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి కళ్లద్దాలతో పాటు మందులు కూడా పంపిణీ చేసింది ప్ర‌భుత్వం. ఈ కార్య‌క్ర‌మం అప్పుడు విజ‌య‌వంత‌మైంది.

తాజాగా కంటి వెలుగు పథకాన్ని మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని నిర్ణయం తీసుకున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించ‌నున్నారు. కంటి వెలుగు కార్య‌క్ర‌మం అమ‌లు తీరుపై సిఎం కెసిఆర్ స‌మీక్షించారు. ప్ర‌జారోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ‌, ఇత‌ర మంత్రుల‌తో కెసిఆర్ స‌మావేశ‌మై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా కంటి వెలుగు కార్య‌క్ర‌మం మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని నిర్ణయం తీసుకున్నారు.

RSS
Follow by Email
Latest news