Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి లోకి భారీ చేరికలు…

తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం నిజామాబాద్ లో మంగళవారం జరిగింది.  ఈ సందర్బంగా తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి (TMPS) లోకి పలువురు కార్యకర్తలు చేరారు. నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకులు ఎర్ర రామచందర్ మాదిగ దాసారపు కృష్ణ మాదిగ తారక్క మాదిగల. ఆధ్వర్యం లొ పలువురు మహిళా నాయకురాలు 75 మంది కార్యకర్తల తొ TMPS తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి లో చేరిపోయారు. TMPS వ్యవస్థాపక అధ్యక్షులు గారి వెంకటేష్ మాదిగ వీరందరికి కండువా కప్పి (TMPS) లోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో దళిత, బడుగు బలహీన వర్గాలవారికి పెద్దగా చేసింది ఏమి లేదన్నారు. ఈ వర్గాల అభివృధ్ధికోసం, తమ హక్కుల సాధన కోసం తమ పోరాటంమరింత ఉదృతం చేస్తామన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఏ రాజకీయ పార్టీ పని చేస్తుందో…ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో వివిధ పార్టీల మెడలు వంచైనా తమ హక్కులను సాధించుకుంటామని వెంకటేష్ హెచ్చరించారు..

ఎర్ర రామచంద్ర గారిని TMPS జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియమించడం జరిగింది అదె విధంగా ధాసారపు క్రిష్ణ మాదిగ ను పుల్లెటి తార మాధిగలను రాష్ట్ర నాయకత్వం లొకి తీసుకోవడం జరిగిందని వెంకటేష్ తెలిపారు. కార్యక్రమంలో (TMPS) రాష్ట్ర కోఆర్డినేటర్ మానాల రాజేశ్వరరావు మాదిగ ముఖ్య అతిథులుగా పాల్గొనగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సేవల లక్ష్మణ్ మాదిగ పన్యాల శ్రీహరి మాదిగ హైదరాబాద్ మీడియా ఇంచార్జ్ మధిరి నర్సింగ్రావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news