ఓరుగల్లులో వీర హనుమాన్ విజయయాత్ర (శోభాయాత్ర) ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విహెచ్ పీ మహానగర కార్యదర్శి శ్రీరాం ఉదయ తెలిపారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీరాం ఉదయ్ మాట్లాడారు.
విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భారీ శోభాయాత్రను నిర్వహించనున్నాం అని స్పష్టం చేశారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతిని వరంగల్ లో
ఘనంగా నిర్వహిస్తున్నాం, అయితే, గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా శోభాయాత్ర నిర్వహించలేదని అన్నారు.
కరోనా మహమ్మారి తోలిగిపోవడంతో రేపు రేపు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అయన వివరించారు. ఈ శోభాయాత్రను వరంగల్ రాంగశాయి పేట మహంకాళి దేవాలయం నుండి హన్న కొండ
పద్మాక్షి దేవాలయం వరకు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా పూజ్య స్వామి
శ్రీ చైతన్యనంద, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర బాద్యులు కృష్ణారెడ్డి గారు పాల్గొని ప్రసంగించనున్నారని తెలిపారు.
ఈ నెల 16న జరిగే ఈ వీర హనుమాన్ విజయయాత్ర బైక్ ర్యాలీలో యువత, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారని, శోభాయాత్ర లో పాల్గొనే భక్తులకు దారి పొడవునా మంచినీళ్ళు, మజ్జిగా, ప్రసాదాలు అందించనున్నామని అన్నారు. నగరంలోని వ్యాపార సాముదాయాల వారు మరియు దాతల సహాయంతో ఈ ఏర్పాటు చేస్తున్నట్లు అయన వివరించారు. . హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో VHP వరంగల్ మహానగర అధ్యక్షులు కేశిరెడి.జైపాల్ రెడ్డి , భజరంగ్ దళ్ కార్యకర్తలు అలకట్ల
సాయి, బండి రోహిత్, శ్రీమతి శ్రీకాండ్. సంగినేని రాకేష్, సుతారి సాయిరాం, నాగుల ప్రసాద్, సాయిపటేల్, తాడిశెట్టి
శ్రీధర్, తరుణ్, అఖిల్, బండాల వంశీకృష్ణ చీకటి సతీష్, బట్టూరి రాజు, తదితరులు పాల్గొన్నట్లు శ్రీరామ్ ఉదయ్ కుమార్ తెలిపారు.