Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం

ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో  అదరగొట్టింది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లోను రాణించి 37 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ కెప్టెన్ ఆర్థిక్ పాండ్యా వీరవిహారం చేయడం, అలాగే మిల్లర్ కూడా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ చతికిల పడింది.

నిర్ణిత  20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 155 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. గుజరాత్ బౌలర్లలో లాకీ ఫెర్గ్యూసన్, యష్ దయాళ్ చెరో మూడు వికెట్లు తీసి రాజాస్థాన కు కళ్లెం వేశారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

RSS
Follow by Email
Latest news