Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఎన్నికల వేళా మోడీ గిఫ్ట్… చేతి వృత్తుల వారికీ గుడ్ న్యూస్…!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చేతి వృత్తుల వారికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభ వార్త తెలిపారు. చేతి వృత్తుల వారిని ఆదుకునేందుకు ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే ఆ పథకానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం కింద మొదటి విడతగా రూ.13,000 కోట్లను కేటాయించినట్లు అయన  వివరించారు. ఈ పథకం కింద మొదటి విడతలో 5% వడ్డీతో రూ.1లక్ష రుణం ఇవ్వబడుతుంది. రెండో విడత కింద మరో రూ.1లక్షను 5%వడ్డీ రాయితీతో అందిచనున్నట్లు మంత్రి అశ్విన్ వివరించారు.

RSS
Follow by Email
Latest news