Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన బంగారు రధం..!

సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రధం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. అసాని తుపాన్ ప్రభావంతో ఆ రథం మన సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. దానిని చూసేందుకు అక్కడి ప్రజలు ఎగపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి సముద్రం రేవుకు ఎప్పుడు చూడని వింతైన రధం మంగళవారం కొట్టుకు వచ్చింది.

ఈ రధమపై తేది 16-1-2022 అని విదేశీ బాష లో లిక్కించి ఉందని మలేషియా,థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది సీమెన్ లు అంటున్నారు. ఇంతవరకు తితిలి వంటి పెద్ద తుఫానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన మందిర రధం చూడలేదని తెలియజేస్తున్నారు. మేరైన్ పోలీసులు స్వాధీనం చేసున్నట్లు తెలిజేశారు.

RSS
Follow by Email
Latest news