Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

త‌న‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వండి : కేఏ పాల్

ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు త‌న‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ తెలంగాణ ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు. ఇప్ప‌టిదాకా దోచుకునే వారికే అవ‌కాశం ఇచ్చార‌ని, కానీ నిజమైన సేవ చేసేందుకు తనకు అవకాశం ఇస్తే ఎలాఉంటుందో చేసి చూపిస్తానని ఆయ‌న వ్యాఖ్యానించారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన అయన రాష్ట్ర, జాతీయ రాజ‌కీయాల‌పైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా అదుపు త‌ప్పాయ‌ని కేఏ పాల్‌ విమ‌ర్శించారు.

బీజేపీ పార్టీ నన్ను నడిపిస్తుందని టీఆర్ఎస్ నాయకులు ఇలాంటి తప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. కులాలు, మ‌తాల పేరుతో  రాజకీయాలు చేస్తున్నారని అలంటి వారిని ఉపేక్షించే ప్ర‌సక్తే  లేద‌ని కేఏ పాల్ హెచ్చ‌రించారు. దేశంలో ఉన్న పార్టీల‌న్నీ అవినీతి పార్టీలేన‌ని ఆయ‌న ఆరోపించారు. దేశంలోని మిగిలిన అన్ని పార్టీలు బీజేపీ అనుబంధ పార్టీలేన‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందని అయన ఆరోపించారు.

RSS
Follow by Email
Latest news