జనవరి 18న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్ష్లులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 27వ వర్దంతి సందర్బంగా…ఏన్ టిఅర్ ట్రస్ట్ భవన్ లో ఉచిత మెగా వైద్య శిభిరం, రక్తదాన శిభిరం నిర్వహిస్తున్నట్లు ఏన్ టి.అర్ ట్రస్ట్ భవన్ వర్గాలు ఒక ప్రకటన లో తెలిపాయి.
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయనని తెలిపారు. క్యాన్సర్,మధుమేహం,గుండె,ఎముకలు,ఊపిరితిత్తులు,వెన్నెముక,చెవి,ముక్కు,గొంతు,లివర్,దంత,నేత్ర,నరాలు,జనరల్ చెక ప్, అలాగే పసిపిల్లలకు సంబందించిన వ్యాధులకు నిపుణులైన కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులు సేవలు అందిస్తారని వివరించారు. ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వనున్నట్లు ఏన్ టిఅర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ వర్గాలు తెలిపాయి. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ భవన్ వర్గాలు కోరారు.
తెలుగుదేశం పార్టీ నాయకులూ, కార్యకర్తలు వారి వారి నియెజకవర్గం కేంద్రంలో రక్తదాన శిభిరాలు, అన్నధాన కార్యక్రమాలు ఇతరత్రా సేవా కార్యక్రమాలు నిర్వహించి అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించాలని కోరారు. అలాగే, నియెజకవర్గం కేంద్రంలో బ్లడ్ డోనేషన్ క్యాంప్ ( రక్తదాన శిభిరాలు) ఏర్పాటు చేసేందుకు అసక్తిగా ఉన్న నాయకులు తదుపరి ఏర్పాట్ల కోరకు ఏన్ టిఅర్ ట్రస్ట్ తరపున బ్లడ్ డోనేషన్ క్యాంప్ నిర్వాహుకులు సెల్ ( ట్రస్ట్ అఫీస్-9963474040. (అక్కేశ్వర్ రావు 7993253244) ల ను సంప్రందించి వారి సేవలను ఉపయోగించుకోవాలని ట్రస్ట్ భవన్ వర్గాలు తెలిపాయి.