Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వేగవంతం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. పులివెందులలోని ఆయన ఇంటిని సీబీఐ అధికారులు మంగళవారం పరిశీలించారు. వివేకా ఇంటి పరిసరాలను ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. అలాగే అయన ఇంటిలో హత్య జరిగిన ప్రదేశం, తదితర ప్రదేశాలను సర్వేయర్ ద్వారా  కొలతలు తీయించారు. అంతకు ముందు వారు సీఎం జగన్ క్యాంపు కార్యాలయం, వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించి ఫోటోలు వీడియోలు తీశారు.

వివేకానందరెడ్డి పీఏ ఇనయతుల్లాను పులివెందులలోని ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో విచారించారు. అనంతరం ఇనయతుల్లాతో పాటు ప్రభుత్వ సర్వేయరు, విఆర్ఓ, ప్రైవేట్ ఫోటో గ్రాఫర్ ను సీబీఐ అధికారులు తమ వాహనాల్లో వెంటబెట్టుకొని పలు ప్రాంతాలు తిరిగారు. ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్ బయట కొలతలు తీసుకుని ప్రతి అంశాన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.

అనంతరం వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, దొండ్లవాగు శంకర్ రెడ్డి ఇండ్ల వద్ద సర్వే చేసి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. భరత్ యాదవ్, ఈసీ గంగిరెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి, ఇళ్ల వద్ద కూడా  సర్వే చేసి ఫోటోలు, వీడియోలు చిత్రీకరించారు.

RSS
Follow by Email
Latest news