ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13 న జరగనున్న సంగతి తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ ఇటీవల ప్రారంభం అయింది. ఇందుకు సంబందించి వైస్సార్సీపీ నుంచి ఐదు నామినేషన్లు దాఖలు అయినాయి. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసింది. ఈ క్రమంలో ఈ ఐదుగురు వైస్సార్సీపీ ఎమ్మెల్సీ సభ్యులు ఏకగ్రీవం అయ్యారు.
ఇక, ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో… మిగిలిన 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న పోలింగ్ నిర్వహించనున్నారు.
ఏకగ్రీవమైన సభ్యులు వీరే…
1) మేరుగ మురళీధర్- నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
2) కె.సూర్యనారాయణ- తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
3) రామసుబ్బారెడ్డి- కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
4) డాక్టర్ సుబ్రహ్మణ్యం- చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
5) మంగమ్మ- అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ.