Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అర్ధరాత్రి విమానంలో గవర్నగ్ తమిళసై ఎం చేసిందో తెలుసా..!

వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో… విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్ లు ఉన్నారా…? అని అనౌన్స్ చేశారు.
అదే విమానంలోనే ప్రయాణిస్తున్న తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కు ఆ విషయం తెలిసి వెంటనే స్పందించారు. ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స  అందించి, భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు.
కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. అదేవిధంగా ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు అభినందనలు తెలిపారు.
అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ చికిత్స క్రమాన్ని కొన్ని ఫోటోలు తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలు… ఎం బి బి ఎస్, ఎం డి- డి జి ఓ లాంటి వైద్య విద్య కోర్సులు చేసిన విషయం విదితమే.
RSS
Follow by Email
Latest news