Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మే 4న దాసరి ఫిలిం అవార్డ్స్

దాసరి నారాయణరావు 75 వ జయంతిని పురస్కరించుకొని ప్రతిభ కలిగిన దర్శకులను సత్కరించనున్నారు. భారతదేశం లోని వివిధ ప్రాంతీయ మరియు హిందీ భాషలలో గుర్తింపు పొందిన 16 మంది చిత్ర దర్శకులను సత్కరించనున్నట్లు దాసరి కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ తాటివాక రమేష్ నాయుడు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫిలింఛాంబర్ లో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రమేష్ నాయుడు, నెహ్రు, చైతన్య జంగ, విజయ్ వర్మ పాకలపాటి తదితరులు పాల్గొన్నారు!!

ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ.. మే 4 సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకులను సత్కరించుకోవటంతోపాటు, చనున్నామన్నారు. అలాగే  పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని అయన అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు , సాంకేతిక నిపుణులు, ఫెడరేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.

ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్-తెలుగు సినిమా వేదిక సమన్వయంతో అంగరంగ వైభవం గా జరిగే ఈ కార్యక్రమ కమిటీకి తాడివాక రమేష్ నాయుడు చైర్మన్ గా, జి.నెహ్రు, చైతన్య జంగ కో ఆర్డినేటర్స్ గా… విజయ్ వర్మ పాకలపాటి కన్వీనర్ గా వ్యవహరించనున్నారు.

RSS
Follow by Email
Latest news