Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై సినీ నటి కరాటే కల్యాణి తో పాటు పలు హిందు సంఘాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఓ పారి అనే ప్రైవేటు ఆల్బమ్ లో హరే రామ , హరే కృష్ణ మంత్రాన్ని ఐటెం సాంగ్ లో చిత్రీకరించారని కరాటే కల్యాణి ఫిర్యాదులో పేర్కొన్నారు.

పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రం పై అశ్లిల దుస్తువులు , నృత్యాలతో పాటను చిత్రీకరించిన దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలివెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలిగించాలని… లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని  ముట్టడిస్తామని కళ్యాణి హెచ్చరించారు.

RSS
Follow by Email
Latest news