Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా వైరస్ తీవ్రత దేశంలో మళ్లీ పెరుగుతోంది. వరుసగా రెండో రోజు 20 వేల పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20,038 పాజిటివ్ కేసులు నమోదైనాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కరోనా  రికవరీ రేటు 98.49 శాతంగా నమోదైంది.

గడిచిన 24 గంటల్లో కరోనాతో 47 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5, 25, 604కి చేరుకుంది. ఇక, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 199,47,34,994 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. 18,92,969 డోసులు నిన్న అందజేశారు.

RSS
Follow by Email
Latest news